Home » Jyotirlingalu » Sri Bhimashankara Jyotirlingam

Sri Bhimashankara Jyotirlingam

శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం (Sri Bhimashankara Jyotirlingam)

యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నామామి

త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెశారు. ఆ విరాధుడు, శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బందించాడు. అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పటి నుంచి స్వామి వారు లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనావళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను తీస్తున్నాడు.

Shiva Pratah Smarana Stotram

శివ ప్రాతః స్మరణం (Shiva Pratah Smarana Stotram) ప్రాతః స్మరామి భవభీతిహరం సురేశం గంగాధరం వృషభవాహన మంబికేశం  || 1 || ఖట్వాంగ శూల వరదాభయ హ సమీశం సంసార రోగహరమౌషధమద్వితీయం || 2 || ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధ...

Dwaraka Tirumala

ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) శ్రీ లక్ష్మీనివాసుడైన వేంకటేశ్వరుడు స్వయంభువు గా వెలసిన దివ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు 41 కి.మి. దూరం లో నెలకొని ఉంది. ఈ క్షేత్రం లో ఒకే...

Mopidevi Subramanya Swamy Temple

Mopidevi Subramanya Swamy Temple సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః. శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం Mopidevi Temple is located 70 Kms...

Sri Shiva Varnamala Stotram

శ్రీ శివ వర్ణమాలా స్తోత్రం (Sri Shiva Varnamala Stotram) అధ్బుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణ గణ అమృత శివఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివఈశ సురేశ మహేశ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!